క్రైమ్/లీగల్

శ్రీవారి మెట్టు మార్గంలో 14 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 26: శ్రీవారి మెట్టు మార్గంలో జూపార్క్ సమీపంలో శేషాచల అడవుల్లో నరికి అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న జువ్వాది మలైకి చెందిన ఒక స్మగ్లర్ అన్నామలైని టాస్క్ఫోర్స్ సిబ్బంది సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈసందర్భంగా మరి కొంత మంది స్మగ్లర్లు తప్పించుకుని పారిపోయారు. వారి కోసం గాలింపును ముమ్మరం చేశారు. వారు వదిలి వెళ్లిన 12 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. పొదల్లో ఉన్న మరో రెండు దుంగలను డాగ్ స్క్వాడ్ గుర్తించింది. కూంబింగ్‌లో హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర, డాగ్ స్క్వాడ్ ఇన్చార్జ్ నటరాజ్‌తోపాటు సుబ్బారెడ్డి, శ్రావణ్ కుమార్, జయచంద్ర, మంగ్యానాయక్, ముత్యాలు, ధనశేఖర్, రఫి, సుధాకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. వీరిని ఐజీ కాంతారావు, ఎస్పీ రవిశంకర్, డీఎస్పీ వెంకటరమణలు అభినందించారు.