క్రైమ్/లీగల్

గాయపడ్డ మహిళను కాపాడే ప్రయత్నంలో బస్సు ఢీకొని సుధీర్ బాబు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 26: రంగంపేట సమీపంలో కేఎంఎం కళాశాల వద్ద ఆటో-కారు ఢీకొన్న ప్రమాదంలో గాయపడ్డ మహిళను కాపాడేందుకు వెళ్లి అదే సమయంలో మదనపల్లి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నారాయణ కళాశాల ఏజీఎం సుధీర్ బాబు తీవ్రంగా గాయపడి మృతి చెందిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. తమ కళాశాల ముందు కారు - ఆటో ఢీకొనడంతో ఓ మహిళ గాయపడింది. ఆమెను కాపాడేందకు సుధీర్ బాబు 108కు ఫోన్ చేశాడు. గాయపడ్డ మహిళను కాపాడుతున్న సమయంలో వేగంగా వచ్చిన బస్సు సుధీర్ బాబును ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కృష్ణా జిల్లా విస్సన్నపేటకు చెందిన సుధీర్ బాబు తిరుపతిలో నివాసం ఉంటూ నారాయణ కళాశాలలో పని చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.