క్రైమ్/లీగల్

వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెళుగుప్ప, ఫిబ్రవరి 26 : మండల పరిధిలోని ఆవులెన్న గ్రామంలో శిల్పా (19) మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు లక్ష్మన్న, ముత్యాలమ్మ కుమార్తె శిల్పాకు, నాగేంద్రతో వివాహమైంది. ఈనేపథ్యంలో ఎర్రగుంటలో అల్లారుముద్దుగా చూసుకునే తాత ఆదివారం మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు లోనై క్షణికావేశంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శిల్ప ఉరివేసుకుందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ విజయనాయక్ తెలిపారు.
యువతి ఆత్మహత్య
నల్లచెరువు, ఫిబ్రవరి 26: నల్లచెరువు మండలం పల్లెవాండ్లపల్లికి చెందిన వెంకటరమణ, జయమ్మ దంపతుల కుమార్తె సవరం వాణి (20) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల మేరకు.. మృతురాలు కడుపునొప్పితో తరచూ బాధపడేదని, మంగళవారం తెల్లవారుజామున కడుపునొప్పి విపరీతంగా రావడంతో పురుగుల మందు తాగినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారన్నారు. చికిత్స నిమిత్తం హుటాహుటిన కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ సత్యరాజు తెలిపారు. మృతురాలు కదిరి బ్లూమూన్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మహిళ ఆత్మహత్య
రాయదుర్గం రూరల్, ఫిబ్రవరి 26 : మండల పరిధిలోని కదరంపల్లి గ్రామానికి చెందిన హరిజన లక్ష్మీదేవి (37) మంగళవారం టిమెట్ గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లక్ష్మీదేవి మూడేళ్ల నుంచి కడుపునొప్పితో బాధపడుతోంది. ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఉన్న టిమెట్ గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమణించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం బళ్లారి విమ్స్‌కు తరలింస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.