క్రైమ్/లీగల్

ఓల్వో బస్సులో తరలిస్తున్న నగదు, బంగారం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, మార్చి 13: ఓల్వో బస్సులో తరలిస్తున్న బంగారం, నగదును కర్నూలు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపధ్యంలో డోన్ పట్టణ శివారులో బుధవారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓల్వో బస్‌ను పోలీసులు తనిఖీ చేశారు. బస్సులో ఉన్న రెండు బ్యాగుల్లో తనిఖీ చేయగా అందులో రూ.88.20 లక్షల నగదు, 1.210 కిలోల బంగారు నగలు లభించాయి. వీటికి సంబంధించి ఇద్దరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బు, నగలకు సంబంధించి ఎలాంటి రశీదులు, పత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు డోన్ డీఎస్పీ ఖాదర్‌బాషా తెలిపారు. నగదు, నగలను ఐటీ శాఖకు అప్పగించినట్లు తెలిపారు.