క్రైమ్/లీగల్

రూ. 18 లక్షలు విలువ చేసే పట్టు చీరలు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుకొండ, మార్చి 14 : సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో గురువారం అనంతపురం జిల్లాలో పో లీసులు పలుచోట్ల వాహనాల తనిఖీలు చేపట్టి రూ. 18 లక్షల విలువ చేసే పట్టుచీరలు, రూ. 2.6 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అందులో భాగంగా పెనుకొండ పట్టణ సమీపంలోని కియా కార్ల తయారీ పరిశ్రమ వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి రూ. 18 లక్షల విలువ చేసే పట్టు చీరలను స్వాధీనం చేసుకున్నట్లు కియా పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు. వివరాలు.. సోమందేపల్లి, ముదిరెడ్డి ప్రాం తాల నుంచి మూడు కార్లలో ధర్మవరానికి పట్టు చీరలను అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆయా కార్లలో రూ. 18.24 లక్షల విలువ చేసే 564 పట్టుచీరలు ఉండగా స్వా ధీనం చేసుకుని ఎన్నికల ఫ్ల యింగ్ స్వ్కాడ్ లీడర్ రమామణికి అందజేసినట్లు తెలిపారు.