క్రైమ్/లీగల్

కేజ్రీవాల్‌కు సమన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 15: బీజేపీ నాయకుడు రాజీవ్ బబ్బర్ దాఖలు చేసిన పరువునష్టం దావాలో ఢిల్లీ కోర్టు శుక్రవారం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఏప్రిల్ 30వ తేదీన న్యాయస్థానం ముందు హాజరు కావలసిందిగా ఆదేశిస్తూ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సమర్ విశాల్ కేజ్రీవాల్, ఇతర నిందితులకు సమన్లు జారీ చేశారు. ఢిల్లీలో ఓటర్ల జాబితాలోనుంచి ఓటర్ల తొలగింపునకు బీజేపీని నిందించడం ద్వారా పార్టీ పరువు తీశారని రాజీవ్ బబ్బర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తమ పార్టీ పరువు తీసిన అరవింద్ కేజ్రీవాల్, రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ గుప్తా, ఎమ్మెల్యే మనోజ్ కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి అతిశి మలేనాలకు వ్యతిరేకంగా విచారణ ప్రక్రియ జరపాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు.