క్రైమ్/లీగల్

ఇద్దరు కుమారుల సహా తల్లి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు, మార్చి 15: భార్యభర్తల మధ్య చెలరేగిన తగాదా నేపథ్యంలో క్షణకావేశంలో తీసుకున్న నిర్ణయం మూడు నిండు ప్రాణాలను బలితీసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరు కుమారులకు క్రిమిసంహారకమందు తాగించి తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మేళ్లచెర్వు మండలంలోని వెల్లటూరు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వెల్లటూరు గ్రామంలోని పునరావాసకేంద్రంలో రసూల్ అలియాస్ ఇసాక్ అనే వ్యక్తి చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తూ గత పదేళ్లుగా జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపధ్యంలో గురువారం సాయంత్రం భార్యభర్తల మధ్య చిన్న ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పాస్టర్ ఇసాక్ కోపంతో బయటికి వెళ్లిపోగా భర్తతో గొడవ పడి మనస్థాపం చెందిన భార్య సలోమి (28) తన కుమారులు అయిన బిలిగ్రామ్ (9), విలీయంకేర్ (7)లకు కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలిపి తాగించిన అనంతరం తాను కూడా సేవించింది. దీంతో వారు ముగ్గురు తీవ్ర అస్వస్థకు గురి కాగా స్థానికులు భర్తకు సమాచారాన్ని చేరవేసి వీరిని చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ఇరువురు కుమారులు గురువారం అర్ధరాత్రి సమయంలో మృతిచెందగా తల్లి సాలోమి ఆరోగ్య పరిస్థితి విషమించగా అమెను మెరుగైన చికిత్స కోసం ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె కూడా మృతిచెందింది. కాగా ఈ ఘటనపై ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, మృతదేహాలను వారి స్వస్ధలాలకు తీసుకెళ్లడంతో ఎలాంటి సమాచారం తేలియడం లేదని స్దానిక ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆసుపత్రి నుంచి మృతదేహాలను మృతుల స్వస్థలమైన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వినుకొండకు తరలించారు. అందరితో కలివిడిగా ఉండే కుటుంబంలో ముగ్గురు మృతిచెందటంతో వెల్లటూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన వెల్లటూరు గ్రామస్థులు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వినుగొండకు తరలివెళ్లారు.