క్రైమ్/లీగల్
చిరుత సంచారంతో ఆందోళన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 March 2019
రామాయంపేట, మార్చి 15: చిరుతపులి దాడిలో లేగదూడ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం పర్వతాపూర్లో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కాముని కిషన్ రైతుకు చెందిన లేగదూడను వ్యవసాయ పొలం వద్ద కట్టేసి ఉదయం వెళ్లి చూసే సరికి చిరుతపులి చంపి తినేసిందని తెలిపారు. ఈవిషయమై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా పంచనామ నిర్వహించారు.
బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గత కొద్ది రోజులుగా చిరుత గ్రామాల్లో సంచరిస్తూ పొలాల వద్ద పశువులను చంపేస్తుండడంతో స్థానికులు భయాందోళనతో కాలం వెళ్లదీస్తున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి వెంటనే చిరుతను బందించాలని డిమాండ్ చేస్తున్నారు.