క్రైమ్/లీగల్

గోడౌన్‌లపై దాడులు : గుట్కా స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, మార్చి 15: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు.. గోడౌన్‌లపై పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఐదుగురు అంతరాష్ట్ర మూఠా సభ్యులతో పాటు వారి వద్ద రూ.1.2 కోట్ల విలువైన గుట్కా ప్యాకెట్లు, సిగరేట్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్‌లోని రాచకొండ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ మహేష్ భగవత్ మాట్లాడారు. అంతరాష్ట్రానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తులు.. నగరానికి పెద్ద ఎత్తున నిషేదిత గుట్కా ప్యాకెట్లు, సిగరెట్లను అక్రమంగా సరఫరా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో దాడులు చేశామని చెప్పారు. ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు, ఇంబ్రహీం పట్నం పోలీసుల సంయుక్తంగా ఇంబ్రహీంపట్నం పరిధిలోని గోకుల్ నగర్‌లో ఉన్న గోడౌన్‌లపై దాడులు నిర్వహించారని పేర్కొన్నారు. దాడులలో ఐదుగురు అంతరాష్ట్ర మూఠాతో పాటు గుట్కా ప్యాకెట్ల లోడ్‌తో ఉన్న లారీ, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.