క్రైమ్/లీగల్

చెట్టును ఢీకొన్న కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మారం, మార్చి 25: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లి క్రాస్ రోడ్ వద్ద కరీంనగర్ నుంచి ధర్మారం వైపు వెళ్తున్న ఏపీ.15ఎసి.3358 అనే నంబర్ గల కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే గల చెట్టును బలంగా ఢీకొట్టడంతో కారు నడుపుతున్న కొడిమ్యాలకు చెందిన కొండూరి మనోహర్ (56) అక్కడికక్కడే మృతి చెందగా, అందులో ప్రయాణిస్తున్న రాగి వీరేశం (78) కూడా మృతి చెందాడు. వీరేశం భార్య సరోజన (76), మనోహర్ భార్య పద్మ (51)లు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందిన, తీవ్ర గాయాలైన నలుగురిని కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సోమవారం మధ్యాహ్నం కొడిమ్యాలకు చెందిన వీరు వెల్గటూరు మండలం గుల్లకోటలోని తమ బంధువుల ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగినట్లు మృతుల బంధువులు, పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెంది, ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ధర్మారం ఎస్‌ఐ ప్రేం కుమార్ తెలిపారు.