క్రైమ్/లీగల్

అనుమానంతో ఆలిని చంపిన భర్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎ కొండూరు, మార్చి 30: వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్యను గొంతు నులిమి హత్య చేసిన వైనం ఇది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా దార్ల మండలం గుంపెళ్ళ గ్రామానికి చెందిన మొటం ఎల్లయ్య, వీరమ్మల కుమార్తె పేర్ల భూలక్ష్మి అలియాస్ లక్ష్మి (35)కి అదే గ్రామానికి చెందిన పేర్ల సంజీవతో 20 ఏళ్ళ క్రితం వివాహం జరిగింది. పదేళ్ళ పాటు వీర కాపురం సజావుగానే సాగింది. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. గత కొంతకాలంగా భార్యకు మరొకరితో సంబంధం ఉందనే అనుమానంతో భర్త మద్యానికి బానిసై ప్రతి రోజు మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేసేవాడు. భర్త పెట్టే చిత్ర హింసలు తాళలేక లక్ష్మి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ విషయమై పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి భర్త వద్దకు పంపినట్లు పోలీసులు తెలిపారు. సంజీవ గ్యాస్ పొయ్యిల రిపేర్లు చేస్తు సంచార జీవనం సాగిస్తు గత కొంతకాలంగా గంపలగూడెం మండలం తోటమూల గ్రామంలో ఉంటున్నాడు. ఈ నెల 29వ తేదీ శుక్రవారం భార్య లక్ష్మి అనారోగ్య కారణంగా హనుమాన్ జంక్షన్‌లో ఆర్‌ఎంపి వైద్యుని వద్ద వైద్యం చేయించి తిరుగుప్రయాణంలో మద్యం సీసాను తీసుకుని నూజివీడు- గంపలగూడెం రహదారిలోని చీమలపాడు అలుగువాగు వద్ద ఖాళీగా ఉన్న ప్రదేశంలో విశ్రాంతి తీసుకుని మద్యం సేవించాడు. భార్యను నిలదీసి ఆమెకు అక్రమ సంబంధం ఉందని బెదిరించి భార్య గొంతు నులిమి చంపివేశాడు. తన చేతిలో శవంగా మారిన లక్ష్మిని హంతకుడు గుర్తుపట్టకుండా చేయాలనే ప్రయత్నం చేశాడు. మొహంపై టవల్ వేసి నిప్పు పెట్టి, ఆ తరువాత సమీపంలోని అలుగు వాగులో పడవేశాడు. శనివారం గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి విచారణ చేస్తుండగా హంతకుడు తానే చంపానని చెప్పి పోలీసులకు లొంగిపోయాడు. వీఆర్‌ఓ జమలయ్య సమక్షంలో పంచానామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మైలవరం సీఐ నాగేశ్వరరావు పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జె వెంకటరమణ తెలిపారు.