క్రైమ్/లీగల్

ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, ఏప్రిల్ 2: సరదాగా ఈతకోసం వెళ్లి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తుపాకుల మణి జస్వంత్ (10), గుండి మనోజ్ (11) అనే ఇద్దరు చిన్నారులు గ్రామంలోనే ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుకుంటున్నారు. పాఠశాల ముగిసిన అనంతరం మధ్యాహ్నం గ్రామ శివారులోని కోమటికుంట చెరువులోకి వెళ్లి ఈత కొడుతుండగా ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. నీటిలో మునిగిన ఇద్దరు చిన్నారులను చూసిన మరో ఇద్దరు బాలురు గ్రామస్థులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకునే లోపే మృతి చెందారు. సత్తయ్య-సుజాతలకు ఏకైక కుమారుడు మణిజస్వంత్, గంగాధర్-అనురాధలకు ఏకైక కుమారుడు మనోజ్ ఉన్నారు. రెండు కుటుంబాల్లో ఏకైక కుమారులు ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మనోజ్ కథలాపూర్ మండలం తుర్తి గ్రామం కాగా, అమ్మమ్మ ఇంటిలో చదువుతున్నాడు. గ్రామ సర్పంచ్ నేతికుంట జలపతి శవాలను సిరిసిల్ల ఆసుపత్రికి తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించారు.
చిత్రం.. జస్వంత్, మనోజ్ మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబీకులు