క్రైమ్/లీగల్

రేణిగుంట వద్ద రూ.39 లక్షలు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఏప్రిల్ 3: చిత్తూరు జిల్లా రేణిగుంట మండల పరిధిలోని గాజులమండ్యం రూరల్ పోలీసులు నాయుడుపేట, తిరుపతి రహదారిలో తనిఖీలు చేస్తుండగా రూ. 39లక్షలు నగదును సీజ్‌చేసిన సంఘటన బుధవారం మధ్యాహ్నం గాజులమండ్యం కూడలిలో చోటుచేసుకుంది. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు ఎన్నికల బందోబస్తులో భాగంగా కేఎల్‌ఎం ఆసుపత్రి కూడలిలో గాజులమండ్యం పోలీసులు తనిఖీలు చేస్తుండగా తిరుపతి సీఎంఎస్ సంస్థకు చెందిన రూ. 39లక్షలను ఏటీఎం మిషన్‌లలో పెట్టేందుకు వెళుతుండగా గుర్తించారు. ఎటువంటి రశీదు లేకపోవడంతో డబ్బును సీజ్‌చేసి ఎన్నికల అధికారులకు అప్పగించారు. ఆయన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఫేస్-3 ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారికి నగదును అప్పగించగా, నగదును శ్రీకాళహస్తి ఎన్నికల ఆర్‌ఓ కార్యాలయానికి తరలించి అక్కడి నుంచి చిత్తూరు కలెక్టరేట్ ట్రెజరీకి తరలిస్తున్నామన్నారు.