క్రైమ్/లీగల్

చేపల వ్యాపారిపై ఐటీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు, ఏప్రిల్ 3: పట్టణంలోని ప్రముఖ చేపల వ్యాపారి కార్యాలయంలో బుధవారం ఆదాయపు పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహించారు. ప్రముఖ చేపల ఎగుమతుల వ్యాపారి బీహార్ రాష్ట్రానికి చెందిన బాలేశ్వరరావుకు సంబంధించిన కార్యాలయంలో, ఎన్‌జీవో కాలనీలో ఉన్న ఆయన నివాసంలోనూ పెద్ద ఎత్తున అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున నగదు, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. రాత్రి 9గంటలు వరకు విచారణ జరగటంతో అధికారులు సమాచారం తెలపలేమన్నారు. కైకలూరు ప్రాంతం చేపల ఎగుమతులు రాష్ట్రంలోనే తలసరి ఆదాయంలో రెండవ స్థానంలో ఉంది. దీంతో ఎన్నికల సమయంలో భారీ ఎత్తున నగదు లావాదేవీలు జరుగుతాయన్న సమాచారంతో అధికారులు ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఈ రాత్రికి తేలనుంది.