క్రైమ్/లీగల్

ప్రేమ జంట ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామచంద్రాపురం, ఏప్రిల్ 16: ఓ యువజంట సోషల్ మీడియాతో పరిచయం చేసుకొని తమ ప్రేమను పెద్దలు కాదంటారన్న అనుమానంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మొరవపల్లి సమీపంలో చోటుచేసుకుంది. మొరవపల్లి దళితవాడకు చెందిన ధనంజయులు (20) జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. శ్రీకాళహస్తి పట్టణం వరదరాజుల గుడి వీధి రజక కులానికి చెందిన రవి కుమార్తె పల్లవి (16) స్థానికంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపీసీ చదివింది. ఇటీవల వెలువడిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాలలో పల్లవి 2 సబ్జెక్టులు ఫైయిలయింది. గత నాలుగురోజుల నుంచి ఇంటినుంచి ఎక్కడికో వెళ్లిపోయిందని, కనబడటం లేదని పల్లవి తండ్రి శ్రీ కాళహస్తి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పల్లవి, ధనంజయులు సోషల్ మీడియాలో ఒకరికి ఒకరు పరిచయం చేసుకున్నారు. ఈ పరిచయం ప్రేమగా మారింది. పల్లవి మైనర్‌గా ఉండటంతో పెద్దలు ఒప్పుకోరని ఇంటినుంచి పారిపోయింది. మంగళవారం ఉదయం మొరవపల్లి వద్ద ఇద్దరూ కలిసి సెల్‌ఫోన్‌లో ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారకులు కారని, తామే చనిపోదలచి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో రికార్డు చేశారు. ఆపై రైలు కింద పడి మృతి చెందారు. పాకాల రైల్వేపోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను రుయా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.