క్రైమ్/లీగల్

భర్త మాట వినలేదని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మిగనూరు: భర్త తన మాట వినలేదని ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి తానూ పోసుకుని నిప్పంటించుకుంది ఓ తల్లి. అయితే చుట్టుపక్కల వారు గమనించి తల్లిని కాపాడారు. పిల్లలు మంటల్లో కాలిపోయారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మసీదుపురంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన పద్మావతి, నరసింహులు పిల్లలు మనోజ్‌కుమార్ (5), సంజయ్ (4) మంటల్లో కాలిపోయారు. కూలిపనులు చేసుకునే నరసింహులు, పద్మావతి మధ్య గొడవలు ఉన్నాయి. స్థానికంగా ఉపాధి దొరక్కపోవడంతో వలస వెళ్లే విషయంపై భార్యాభర్తలు తర్జనభర్జన పడుతున్నారు. చిన్నపిల్లలు ఉన్నందున స్థానికంగా ఉందామని భర్త సర్దిచెప్పాడు. అయితే వలస వెళ్లేందుకు పద్మావతి పట్టుబట్టింది. భర్త తన మాట వినకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన పద్మావతి బుధవారం ఉదయం నరసింహులు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో నిద్రపోతున్న ఇద్దరు పిల్లలు మనోజ్‌కుమార్, సంజయ్‌పై పెట్రోల్ పోసింది. అనంతరం తానూ పోసుకుని అందరికీ నిప్పంటించింది. ఇది గమినించిన చుట్టుపక్కలవారు ముగ్గురినీ కాపాడి ఆసుపత్రికి తరలించారు. పద్మావతి ప్రాణాలతో బయటపడగా పిల్లలిద్దరూ మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.