క్రైమ్/లీగల్

కొండా విశే్వశ్వరరెడ్డికి ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 29: కాంగ్రెస్ పార్టీ నాయకుడు, చేవెళ్ల ఎంపీ కొండా విశే్వశ్వరరెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఎన్నికల సమయంలో డబ్బుల వ్యవహారంలో నోటీసులు ఇచ్చేందుకు వెళితే పోలీసులను నిర్బంధించిన కేసులో విశే్వశ్వరరెడ్డిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించగా నాంపల్లి కోర్టు పిటీషన్‌ను గురువారం నాడు కొట్టివేసింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.