క్రైమ్/లీగల్

భార్యను బండరాయితో మోది హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, ఏప్రిల్ 30: పట్టణంలోని హనుమాన్‌వాడలో నివాసముంటున్న రేపాక నాగరాజు తన భార్య కవిత (31)ను బండరాయితో మోది చంపేసిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. నాగరాజుకవితలకు 14సంవత్సరాల క్రితం వివాహం కాగా వారికి ఇద్దరు పిల్లలు వంశీ 6వ తరగతి, కూతురు మూడవ తరగతి విద్యనభ్యసిస్తున్నారు. వీరి మధ్య గత కొన్ని సంవత్సరాలుగా తరచు గొడవలు జరుగుతుండేవని స్థానికులు తెలియజేసారు. అదేవిదంగా సోమవారం రాత్రి వీరిరువురి మధ్య గొడవ ఏర్పడి చిలికి చిలికి గాలివానగామారి ముదిరిపోగా ఆవేశంలోనున్న భర్త నాగరాజు భార్య తలపై బండరాయితో బాదడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. అరుపులు విన్న ఇరుగుపొరుగువారు విషయం తెలుసుకుని తీవ్రగాయాలపాలైన కవితను వెంటనే భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా ఆమె మరణించినట్లుగా డాక్టర్లు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించి కవిత శవాన్ని బందువులకు అందజేశారు. తల్లి మరణంతో అనాదలైన పిల్లలరోదనలు అందరి మనసులను కలిచివేశాయి.