క్రైమ్/లీగల్

కానిస్టేబుల్ చేతిలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, మే 1: పోలీసు శాఖలో పని చేస్తున్న మగ, ఆడ కానిస్టేబుళ్ల మధ్య ఏర్పడిన ప్రేమ వివాహానికి దారి తీయడంతో కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్‌ను దారుణంగా హత్య చేసి, శవంపై పెట్రోల్ పోసి తగులబెట్టిన సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో బుధవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం వనంపల్లి గ్రామానికి చెందిన మందారిక (30) రామచంద్రాపూర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తుంది. 2014 సంవత్సరం పోలీస్ కానిస్టేబుల్ బ్యాచ్‌కు చెందిన మందారికతో 1995 బ్యాచ్‌కు చెందిన ప్రకాష్‌తో పరిచయం ఏర్పడింది. మండల కేంద్రమైన కందికి చెందిన ప్రకాష్ ప్రస్తుతం హత్నూర పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రకాష్‌కు భార్య, ఇద్దరు సంతానం ఉండగా మందారికతో కూడా సహ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మందారిక తనను వివాహం చేసుకోవాలని ప్రకాష్‌పై వత్తిడి పెంచింది. దీంతో మందారికను అడ్డు తొగిలించుకోవాలని ప్రకాష్ పథకం రూపొందించుకున్నాడు.
గత నెల 29వ తేదీన విధులు ముగించుకుని వెళ్లిన మందారిక ఇంటికి చేరుకోలేదు. పైగా సెల్‌ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో అనుమానం వచ్చిన తండ్రి 30వ తేదీన రామచంద్రాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. రామచంద్రాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి అనుమానితుడైన ప్రకాష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించడంతో పాటు శవాన్ని కాల్చివేసిన స్థలాన్ని కూడా చూపించాడు. బుధవారం ఉదయం సంఘటన స్థలానికి చందానగర్, రామచంద్రాపూర్ పోలీసులతో పాటు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సగం కాలిపోయిన శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రాలు.. హత్యకు గురైన మహిళా కానిస్టేబుల్ మందారిక (ఫైల్‌ఫొటో),
*సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇతర పోలీసు అధికారులు