క్రైమ్/లీగల్

చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, మే 1: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన బుధవారం జూపూడి గ్రామంలో జరిగింది. ఇబ్రహీంపట్నం పోలీసుల సమాచారం ప్రకారం.. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెం గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కోదాడలోని ఆలయంలో పూజలు చేసుకుని తిరిగి వస్తుండగా జూపూడి గ్రామం వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న యలమంచిల శ్రీ్ధర్, మాదాల పద్మినికుమారి (55) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురు చైతన్య, శివపార్వతి, సాత్విక, సునీల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గొల్లపూడిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఇబ్రహీంపట్నం సీఐ దుర్గారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.