క్రైమ్/లీగల్

గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, మే 1: సంగారెడ్డి జిల్లా పటన్‌చెరు పోలీసులు బుధవారం సుమారు నాలుగు వందల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. భారీ ఎత్తున మత్తు పధార్థాలను లారీలో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు వారిని కోర్టు రిమాండుకు తరలించారు. మండల పరధిలోని ముత్తంగి గ్రామ శివారులలోని ఔటర్ రింగ్ రోడ్డుపై వైజాగ్ నుండి జహీరాబాద్ వైపు వెలుతున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా దీని వెనుక ఓ ముఠా ఉన్నట్లు పొలీసులకు తెలిసింది. దీనికి సంబంధించిన వివరాలను పటన్‌చెరు డిఎస్‌పి రాజేశ్వర్‌రావు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు. బీదర్ జిల్లా ఔరాద్ తాలుకా జంబాగి గ్రామం డాకు తాండాకు చెందిన రాథోడ్ లక్ష్మణ్(37) లారీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. అతనికి ఇద్దరు భార్యలు, ఐదుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఔరాద్ పట్టణానికి చెందిన శశిరావ్ కొలిక్ వద్ద లారీ డ్రైవరుగా పని చేస్తున్న లక్ష్మణ్ చెరుకు లోడ్‌ను సంగారెడ్డి పట్టణ శివారులలోని గణపతి షుగర్ ఫ్యాక్టరీకి తరలించే వాడు.