క్రైమ్/లీగల్

మావోల ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా పరిధిలో మావోయిస్టులు గురువారం ఇద్దరు గ్రామస్థులను కాల్చి చంపారు. పోలీసుల కథనం ప్రకారం సుకుమా జిల్లాలోని కాస్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కరిగుండం గ్రామంలో పొడియం ముక్తా, కోకోలంచు అనే ఇద్దరిని మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ గ్రామానికి చెందిన వారి వల్లే ఇటీవల ఓ మహిళ మావోయిస్టు పోలీసులకు చిక్కిందని ఆరోపణలు ఉన్నాయి. మహారాష్టల్రో మందుపాతర పేల్చి 16 మందిని హతమార్చిన మావోలు అంతలోనే గ్రామస్థులను చంపటం సంచలనం కలిగించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న సుకుమా జిల్లాలో ఈ ఘటన జరగటంతో ఈ ప్రాంతంలోని కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇలాఉండగా ఇటీవల బీజేపీ శాసనసభ్యుడు బీమా మడివి హత్యలో ప్రధాన నిందుతునిగా ఉన్న మావోయిస్టు కమాండర్ మడివి ముయ్య అలియాస్ రోషన్ అలియాస్ జోగా(29)ని దంతెవాడ జిల్లాలోని మార్కమిరాస్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎదురు పడటంతో పోలీసులు కాల్చి చంపారు. బీజేపి ఎమ్మెల్యే హత్యలో ఈయనదే కీలక పాత్రగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈయన వద్ద నుండి ఒక తుపాకితోపాటు ఆరు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
చిత్రం...పోలీసుల చేతిలో హతమైన మావోయిస్టు కమాండర్