క్రైమ్/లీగల్

11 బంగారు బిస్కెట్లు అపహరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందివాడ, మే 2: మండలంలోని జనార్థనపురంలో తాళాలు వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తలుపుగడియ తీసి ఇంట్లోకి ప్రవేశించి రూ. 40లక్షలు విలువ చేసే బంగారం, 5వేలు నగదు దొంగిలించిన సంఘటన బుధవారం తెల్లవారు జామున జరిగింది. నందివాడ పోలీసుల కథనం ప్రకారం జనార్థనపురం గ్రామంలోని మలిరెడ్డి రాందాసు రెడ్డి కుటుంబం పశ్శిమ గోదావరి జిల్లా తణుకులో నివాసం ఉంటారు. అయితే జనార్థనపురం వారి సొంత ఊరు కావడం పొలాలు, బంధువులు ఇక్కడ ఉండటంతో ఏవైనా పెళ్లిళ్లు, దేవస్థానంలో పూజలు జరిగినపుడు వారం రోజులు ఇక్కడే ఉంటారు. మిగిలిన రోజుల్లో నెలకొకసారి వచ్చి వెళుతుంటారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తణుకు నుండి పోన్ రావడంతో ఆయన తన భార్యను తీసుకొని వెళ్లారు. మళ్లీ గురువారం ఉదయానే్న వచ్చి చూసే సరికి ఇంటి తలుపులు తీసి, బీరువా తలుపులు పగలకొట్టి ఉండటంతోఒక్కసారి ఆయన హతాశులయ్యారు. ఇంటిలో చూడగా బీరువాలోఉన్న ఒక్కొక్క బిస్కెట్ 100 గ్రాములు చొప్పున 1100గ్రాములు బంగారం, 5వేలు నగదు మాయం కావడంతో పోలీసులకు బాధితుడు పిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే చోరీ జరిగిన సంఘటనా స్థలాన్ని గుడివాడ రూరల్ రూరల్ సీఐ జి.శ్రీనివాస్, నందివాడ ఎస్.ఐ జి. అనిల్ పరిశీలించి డాగ్ స్వ్కాడ్‌తోతనిఖీలు నిర్వహించారు. బాధితుని నుండి వివరాలు సేకరించి ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.