క్రైమ్/లీగల్

తుపాకీతో కాల్చుకున్న ఏఆర్ కానిస్టేబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, కామారెడ్డిరూరల్, మే 3: ఎఆర్ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కామారెడ్డి డిఎస్పీ లక్ష్మినారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌గౌడ్(46) ఎఆర్ కానిస్టేబుల్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత నాలుగు సంవత్సరాలుగా విదులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం కామారెడ్డి కోర్టు రోడ్‌లోని పాత తహశీల్దార్ కార్యాలయంలో గల పోలీస్ ట్రెజరీ కార్యాలయంలో సెక్యురిటి విదులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విదులు నిర్వహిస్తున్న సమయంలో 303 రైఫెల్‌తో తనకు తానుకాల్చుకున్నాడని తెలిపారు. తనకు పదోన్నతి లభించడం లేదని మనస్థాపానికి గురై తనకుతాను కడుపులో ఒక రౌండ్ కాల్చున్నాడని తెలిపారు. ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన విషయం తెలుసుకున్న తోటి సిబ్బంది సంబందిత అధికారులకు సమాచారం అందించారు. వెంటనే హుటాహుటిన 108 అంబులెన్స్‌లో ఎఆర్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌గౌడ్‌ను కామారెడ్డి ఏరియాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ శే్వతారెడ్డి, డిఎస్పీ లక్ష్మినారాయణ లు ఏరియాసుపత్రికి చేరుకొని ఆత్మహత్యానికి కారణాలను తెలుసుకున్నారు. బాదితునికి మెరుగైన చికిత్స అనంతరం కాల్పుల సంఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది.