క్రైమ్/లీగల్

దుర్గానగర్‌లో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మే 3: పంజాగుట్టలోని దుర్గానగర్ కాలనీలో శుక్రవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాలనీలోని ఫ్లాట్ నెంబర్ 61లోని సర్వెంట్ రూమ్‌లో వంట చేస్తున్న సమయంలో గ్యాస్ స్టౌవ్‌లో తలెత్తిన సమస్యతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లోని బట్టలు, ఇతర సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటల చెలరేగకుండా అదుపులోనికి తీసుకువచ్చాయి. మండువేసవిలో కాలనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది క్షణాల వ్యవధిలో స్థానిక పంజాగుట్ట చేరుకొని మంటలను అదుపులోనికి తీసుకురావడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు. ఈ ఘనటలో ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు పేర్కొన్నారు. వేసవి కాలంలో మహిళలు వంట చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, చిన్నపాటి నిర్లక్ష్యంతో భారీ ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక అధికారులు సూచించారు.