క్రైమ్/లీగల్
ఆలయంలో చోరీకి యత్నం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 5 May 2019
థెని, మే 4: తమిళనాడులోని ఓ గుడిలో జరిగిన చోరీ యత్నాన్ని అక్కడి అర్చకులు తిప్పికొట్టారు. అయితే, దోపిడీకి వచ్చిన దుండగులు జరిపిన దాడిలో ఒక అర్చకుడు మృతి చెందగా, మరో అర్చకుడు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం...సురులి ప్రాంతంలోని భూత నారాయణస్వామి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు ముసుగులు ధరించి చొరబడ్డారు. హుండీని పగులగొట్టేందుకు వారు ప్రయత్నించారు. అయితే, ఆలయంలోనే నిద్రిస్తున్న అర్చకులు మలయన్ (70), బాలసుబ్రమణి (59) వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన పెనుగులాటలో మలయన్ మృతి చెందగా, బాలసుబ్రమణి తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలం నుంచి పారిపోయిన ఇద్దరు దుండగుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు.