క్రైమ్/లీగల్

దవాఖానాలో రాసలీలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 4: తలనొప్పి వస్తుందని వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రభుత్వ వైద్యుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పల్ సర్కిల్‌లోని చిల్కానగర్ డివిజన్‌లోని కమ్యూనిటీ హాల్‌లో బస్తీ దవాఖానాఉంది. ఇక్కడ పని చేస్తున్న డాక్టర్ కాట బాల్‌రాజు వద్దకు ఇదే ప్రాంతంలో నివసిస్తున్న 35 ఏళ్ల మహిళ ఈ నెల 2న వచ్చింది. రెండు నెలలుగా తలనొప్పి వస్తుందని, మందులు వాడుతున్నా నొప్పి తగ్గడంలేదని అన్నారు. మైగ్రేన్ ఉందని ఫిజియోథెరపీ వైద్యం చేస్తే తప్ప తగ్గదని వైద్యుడు చెప్పారు. శనివారం 4వ తేదీన శనివారం అమావాస్య రోజు రెండు గంటలకు ఆసుపత్రికి రావాలని చెప్పి తలపై వెంట్రుకలను కత్తెరతో కట్ చేసి మందులు ఇచ్చి అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. ఈ విషయం ఇంటికి వచ్చిన భర్తకు చెప్పగా శుక్రవారం ఆసుపత్రికి వెళ్లారు. అతడు లేకపోవడంతో శనివారం మళ్లీ స్థానికులతో కలిసి వచ్చి బాల్‌రాజ్‌ను నిలదీశారు. అంతటితో ఆగకుండా అతడిపై దాడి చేసి పోలీసులకు అప్పగించారు. వైద్యుడు బాల్‌రాజు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనంతచారి తెలిపారు.
చిత్రం... మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రభుత్వ వైద్యుడు బాల్‌రాజు