క్రైమ్/లీగల్

భార్య ప్రియుడిపై భర్త కత్తితో దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, మే 5: గుడివాడ వాంబే కాలనీలో వ్యక్తిపై హత్యాయత్నం కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి కత్తితో దాడి చేయడం, బైక్‌ను దగ్ధం చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామానికి చెందిన మురళీకృష్ణ శ్యామలను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. శ్యామల గుడివాడ పట్టణంలోని అక్కినేని నాగేశ్వరరావు కళాశాల సమీపంలో ఉన్న వాంబే కాలనీలో ఉంటోంది. ఈమెకు ఏ కొండూరు మండలం చీమలపాడుకు చెందిన గోకరాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇదిలా ఉండగా మురళీకృష్ణ కూడా తన భార్యతో కలిసి ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. శ్యామలను ఇంటికి వచ్చి కలుస్తూ ఆమెను ఒప్పించడంలో నిమగ్నమయ్యాడు. గోకరాజు కూడా శ్యామల ఇంటికి వస్తున్నాడు. శనివారం అర్ధరాత్రి సమయంలో గోకరాజు శ్యామలతో ఉన్న సమయంలో మురళీకృష్ణ కూడా వచ్చాడు. దీంతో గోకరాజును శ్యామల ఇంట్లోనే దాచి పెట్టింది. అనుమానం వచ్చి మురళీకృష్ణ ఇంట్లో వెతకగా గోకరాజు కన్పించాడు. అతనిపై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. అక్కడే ఉన్న శ్యామల భర్త మురళీకృష్ణ కళ్ళలో కారం కొట్టి ప్రియుడిని రక్షించుకుంది. అతనితో కలిసి పారిపోయింది. కోపంతో మురళీకృష్ణ ఇంటి బయట ఉన్న గోకరాజు ద్విచక్ర వాహనాన్ని దగ్ధం చేశాడు. గోకరాజు తీవ్రగాయాలతో గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. ఈ మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.