క్రైమ్/లీగల్

నుర్మతిలో గిరిజనుడి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.మాడుగుల, మార్చి 28: విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం నుర్మతి గ్రామంలో మంగళవారం అర్థరాత్రి గొల్లోరి రమణబాబు (40) అనే గిరిజనుడు హత్యకు గురయ్యాడు. మావోయిస్టులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తవౌతున్నా, ఈ హత్యకు ఎవరు పాల్పడినది ఇంకా తెలియరాలేదు. నుర్మతి పంచాయతీ సంగంబంద గ్రామానికి చెందిన రమణబాబుకు ఇద్దరు భార్యలు కాగా రెండో భార్య శారద ఇటీవల భర్తతో తగాదాపడి తన తల్లిదండ్రుల గ్రామమైన హుకుంపేట మండలం చట్రాయిపుట్టు వెళ్లిపోయింది. తన రెండో భార్యను తీసుకురావడానికి మంగళవారం వెళ్లిన రాంబాబు సాయంత్రం సమయానికి నుర్మతికి వచ్చి అక్కడే నివాసం ఉండేందుకు సిద్ధమయ్యాడు. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా గ్రామంలో మంగళవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు భార్యతో పాటు తన రెండేళ్ల చిన్నారిని తీసుకెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా స్థానిక పోలీస్ ఔట్ పోస్టు సమీపాన హత్యకు గురయ్యాడు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తమ ముఖాలకు మాస్క్‌లు ధరించి మెటార్ బైకుపై వచ్చి రమణబాబు చేతిలో ఉన్న బాలుడ్ని కిందకు దింపి రమణబాబును గొడ్డలితో నరికి హత్య చేసారు.