క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 8 May 2019
రైల్వేకోడూరు, మే 7: కడప జిల్లా రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేట సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆటోను లారీ ఢీకొనడంతో ఆటోడ్రైవర్ మణికంఠ(27), వెంకటరత్నం(28) అక్కడికక్కడే మృతి చెందారు. చల్లా విజయకుమారి, కిషోర్(6), ప్రత్యూష(8)కు గాయాలయ్యాయి. శేషక్కగారిపల్లెకు చెందిన విజయకుమారి తన పిల్లలకు అనారోగ్యం చేయడంతో కోడూరులోని ఆస్పత్రిలో చూపించి స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా ప్రమాదం బారిన పడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.