క్రైమ్/లీగల్

పోలీస్ కస్టడీకి సైకో కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ లీగల్, మే 7: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపురం గ్రామంలో ముగ్గురు బాలికల హత్య కేసులో నిందితుడైన సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డిని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా కోర్టు మంగళవారం అనుమతి జారీ చేసింది. బాలికల వరుస హత్యల కేసుల విచారణ, ఆధారాల సేకరణతో పాటు నిందితుడు ఇంకా ఏమైనా నేరాలు చేశాడా, ఇతర మిస్సింగ్ కేసుల్లో ఇతడి ప్రమేయం ఏమైనా ఉందా? అన్న కోణాల్లో విచారణ చేయాల్సివున్నందున కస్టడికి అనుమతించాలని రాచకొండ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారించిన జిల్లా జడ్జి శశిధర్‌రెడ్డి ఈనెల 8 నుండి 13 వరకు ఆరు రోజుల పాటు శ్రీనివాస్‌రెడ్డిని పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడిని మానసికంగా, శారీరకంగా హింసించకుండా విచారణ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీసుల కస్టడీ పిటిషన్‌కు జిల్లా కోర్టు అనుమతినివ్వడంతో సైకో కిల్లర్ నేరాల విచారణలో మరింత పురోగతి దిశగా పోలీసులు ముందడుగు వేసేందుకు అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం వరంగల్ జైల్లో ఉన్న నిందితుడిని రాచకొండ పోలీసులు నేడు కస్టడీకి తీసుకుని అతడి నేరాలపై విచారణ కొనసాగించనున్నారు.