క్రైమ్/లీగల్
ఏసీబీకి చిక్కిన అటవీశాఖ అధికారి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 14 May 2019
ఆదోని, మే 13: బొగ్గుల వ్యాపారి నుంచి రూ.16 వేలు లంచం తీసుకున్న కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ అటవీశాఖ అధికారి వెంకటసుబ్బుడును ఏసీబీ అధికారులు సోమవారం అరెస్టు చేశారు. మార్కాపురానికి చెందిన వ్యాపారి నాగార్జునరెడ్డి బొగ్గుల వ్యాపారానికి అనుమతి కోసం అటవీశాఖ అధికారి వెంకటసుబ్బుడును కలవగా ఆయన రూ.30 వేలు లంచం అడిగాడు. అయితే రూ.16 వేలు ఇచ్చేందుకు అంగీకరించిన నాగార్జునరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు సోమవారం అటవీశాఖ అధికారి వెంకటసుబ్బుడుకు రూ.16 వేలు లంచం ఇస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపారు.