క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, మే 31: రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం చెందింది. విజయవాడ - చత్తీస్‌ఘడ్ జాతీయ రహదారిపై జి.కొండూరులో శుక్రవారం సాయంత్రం ఈప్రమాదం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల తెలిపిన వివరాల ప్రకారం జి.కొండూరు గ్రామానికి చెందిన మరీదు సర్వేశ్వరరావు కుమార్తె మరీదు మల్లీశ్వరి (19) విజ్ఞాన్ యూనివర్శీటీలో బిజెడ్‌సి రెండవ సంవత్సరం చదువుతోంది. ఈమె స్కూటీపై పినపాక నుంచి జి.కొండూరు వస్తుండగా, పినపాక క్రాస్ రోడ్ వద్ద ఇబ్రహీపట్నం నుంచి మైలవరం వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న మల్లీశ్వరి ఎగిరి రాళ్ళ కుప్పపై పడింది. తలకు తీవ్రగాయమై రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బాధితురాలిని విజయవాడలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మల్లీశ్వరి మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు.