క్రైమ్/లీగల్

ముగ్గురిని మింగిన ఈత సరదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: ఈత సరదా ముగ్గురి నిండు ప్రాణాలను బలిగొంది. జనగామకు చెందిన మూడ్ అవినాష్ తన భార్య, ఇద్దరు మరదళ్లను వెంట పెట్టుకొని రిజర్వాయర్ వద్దకు వెళ్లాడు. ఈత సరదాతో మరదళ్లతో కలిసి రిజర్వాయర్‌లోకి దిగి నీళ్లతో ఆటలాడుకుంటూనే మృత్యు ఒడిలోకి వెళ్లిపోయారు. ఈ సంఘటన జనగామ జిల్లా నర్మెట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ వద్ద శనివారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్ష్యుల వివరాల ప్రకారం... జనగామకు చెందిన అవినాశ్ (38) తన భార్య, మరదళ్లు రఘునాథపల్లి మండలం మేకలగట్టుకు చెందిన లకావత్ సంగీత (19), సుమలత (18)లతో కలిసి రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. నీటిలోకి దిగి సంబరంగా నీళ్ళు చల్లుకుంటూ ముందుకు వెళ్లారు. అక్కడ రిజర్వాయర్ లోతు ఎక్కువగా ఉండడంతో ముగ్గురు ఒకేసారిగా నీటిలో మునిగిపోయారు. గట్టుపై ఉన్న మృతుడి భార్య ఈ సంఘటనను తన సెల్‌ఫోన్‌లో బందిస్తుండగానే ఈ సంఘటన జరిగింది. అవినాశ్ భార్య అరుపులు, పెడబొబ్బలు పెట్టడంతో సమీపంలో ఉన్న గ్రామస్థులు సంఘటన స్థలానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటికే ఆ ముగ్గురు నీటిలో మునిగిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బంధువులు రిజర్వాయర్‌లో మునిగిన ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు. నర్మెట సీఐ సంతోష్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పంచానామ నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

చిత్రం... మార్చురిలో ముగ్గురి మృతదేహాలు