క్రైమ్/లీగల్

రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, జూన్ 1: క్రిమిసంహరక మందు తాగి గంగారంలో యువ రైతు సాలేకుల యాదయ్య 32 శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మహేశ్వరం సీఐ వెంకన్ననాయక్ కథనం ప్రకారం.. గంగారం గ్రామానికి చెందిన సాలెకుల యాదయ్య వ్యవసాయ పొలంలో పంటలు పండక బోర్లలో నీళ్లు లేక పోతే కొత్తగా బోరు వేశారు. అందులో నీళ్లు రాలేదు, ఇదే సమయంలోభార్య అనిత భర్తపై అలిగి అమ్మగారింటికి వెళ్లడంతో మానసికంగా కుమిలిపోయిన యాదయ్య మే 29వ తేదీన వ్యవసాయ పొలం వద్ద పూలచెట్లకు వాడే క్రిమిసంహరకమందు తాగి తనను రక్షించాలని సమీపంలోని మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు అప్పటికే పరిస్థితి విషమించడంతో 108 అంబులెన్స్‌లో వెంటనే మైరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. అతనికి భార్య ఇద్దరు కోడుకులున్నారు.
మహేశ్వరం పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శనివారం పోస్టుమార్టం ఆనంతరం మృతిదేహన్ని బంధువులకు అప్పగించినట్లు తెలిపారు.