క్రైమ్/లీగల్

తాగిన మైకంలో తల్లిని చంపిన కొడుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, జూన్ 8: చిత్తుగా తాగిన మైకంలో ఉన్న కొడుకు నిద్రిస్తున్న తల్లిని కొట్టి చంపి, తర్వాత దానిని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి యత్నించిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. ఇంట్లో నిద్రిస్తున్న తల్లి భారతమ్మ (45)ను కొడుకు సైదులు(27) కొట్టి చంపి ఎవరికీ అనుమానం రాకుండా ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించిన సంఘటన అచ్చంపేట మండల పరిధిలోని మనె్నవారిపల్లి గ్రామంలో శుక్రవారం అర్దరాత్రి చోటుచేసుకుంది. సిద్దాపూర్ ఎస్‌ఐ రాజు తెలిపిన సమాచారం ప్రకారం గత కొంతకాలంగా సైదులు తాగి తల్లి భారతమ్మను తాగడానికి డబ్బులు ఇవ్వాల్సిందిగా వేధించేవాడు. కూలి పనులు చేసుకుంటూ కాలం వెళ్లదిస్తున్న ఆమెతో పలు సందర్భాలలో గొడవ పడే వాడని స్థానికులు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి తాగిన మైకంలో ఆమెను కొట్టి చంపి, తర్వాత ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని నమ్మడానికి ప్రయత్నించాడు. తర్వాత తన ప్రయత్నం సాగదని తెలుసుకుని సైదులు సిద్దాపూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ రాజు పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.