క్రైమ్/లీగల్
క్షుద్రపూజలు నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 9 June 2019
రాజేంద్రనగర్, జూన్ 8: ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్న వ్యక్తిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హసన్నగర్లో నివాసం ఉండే జమీల్. శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో క్షుద్రపూజలు నిర్వహిస్తూ ఇంట్లో మాంసం కొడుతున్నాడు. దీంతో చుట్టుపక్కల వారు గమనించి జమీల్ను పిలిచి విచారించగా శాంతి పూజలు చేయిస్తున్నానని బదులిచ్చాడు. స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షుద్రపూజలు చేస్తున్న జమీల్ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి పలు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.