క్రైమ్/లీగల్

కారు ఢీకొని వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జూన్ 8: గుర్తు తెలియని కారు ఢీకొనడంతో పాదచారుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల పాతపాలెం గ్రామానికి చెందిన ముమ్మల్ల పద్మమ్మ, రాములు(45)లు భార్యభర్తలు. వీరు బతుకుదెరువు కోసం నగరంలోని శంషాబాద్‌లో ఉంటూ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం పని నిమిత్తం బయటకు వెళ్లాడు. అరాంఘర్ చౌరస్తాలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అరాంఘర్‌లోని పిల్లర్ నెంబర్ 317 వద్ద ఓ గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి రాములును ఢీకొట్టింది. ఘటనలో రాములు కింద పడి తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రాములు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.