క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంగూరు, జూన్ 9: సెలవులు గడపడానికి ఇంటికి వచ్చిన ఒక జవాన్ రోడ్ ప్రమాదంలో మృతి చెందాడు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండల పరిధిలోని సర్వారెడ్డిపల్లి తండా దగ్గర అచ్చంపేటకు చెందిన జవాను సోమా రాజశేఖర్ (38)అనే వ్యక్తి ఆదివారం కారు ప్రమాదంలో మృతి చెందాడు. అతనితో పాటు కారులో ప్రయాణిస్తున్న అచ్చంపేటకు చెందిన మహేష్‌కు తీవ్ర గాయాలయ్యాయ. జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో జవానుగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ ఆదివారం సెలవుపై వచ్చాడు. సొంత కారులో అతనితో పాటు స్నేహితుడు మహేష్ ఇద్దరూ అచ్చంపేటకు బయలుదేరారు. మధ్యలో కోనేటిపూర్ టోల్‌ప్లాజా వద్ద ఆర్మీ ఐడెంటిటీ కార్డు లేకపోవడాన్ని గుర్తించాడు. దానిని కడ్తాల్ టోల్‌ప్లాజా వద్ద మరిచిపోయనట్టు గుర్తుకురావడంతో దానిని తేవడానికి తిరిగి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు చెట్టుకు ఢీ కొనడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో పాటు ప్రయాణిస్తున్న మహేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.

చిత్రం... జవాను కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులు