క్రైమ్/లీగల్
దారుణ హత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 15 June 2019
రాజేంద్రనగర్, జూన్ 14: శంషాబాద్లోని తొండుపల్లి గ్రామ శివారులో రైలు పట్టాల సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తిని, గుర్తుతెలియని దుండగులు ఇనుపరాడ్తో తలపై బలంగా మోది హత్య చేసిన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తికి దాదాపు 45 సంవత్సరాల వయస్సు వుంటుందని తెలిపారు. ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడవేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని శంషాబాద్ డీసీపీ అశోక్ పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.