క్రైమ్/లీగల్

గోదావరిలో మునిగి ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్రేయపురం, జూన్ 15: షార్ట్ ఫిల్ములకు లొకేషన్లు చూడటానికి వచ్చి, గోదావరిలో స్నానం చేస్తూ ఊబిలో చిక్కుకుని ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక వద్ద ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలావున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గరగ సుధీర్ (33) షార్ట్ఫిల్ము డైరెక్టర్. హైదరాబాద్‌కు చెందిన కెమెరామన్ శనక్కాయల కార్తీక్ (35), రావులపాలెంకు చెందిన అసిస్టెంట్ కెమెరామన్ జి విజయ్‌తో కలిసి సుధీర్ శనివారం మధ్యాహ్నం గోదావరి తీరంలో లొకేషన్లు చూడటానికి వెళ్లాడు. బొబ్బర్లంక సమీపంలోని పిచ్చుకలంక వద్ద ముగ్గురూ గోదావరిలో స్నానానికి దిగారు. వీరు స్నానం చేస్తుండగా విజయ్‌కు ఫోన్ రావడంతో గట్టుపైకి వచ్చాడు. ఇంతలో సుధీర్, కార్తీక్ స్నానం చేస్తూ నదిలోని ఊబిలో చిక్కుకుని నీటమునిగిపోయారు. సమాచారం అందుకున్న అమలాపురం డిఎస్పీ రమణ, ఆత్రేయపురం ఎస్‌ఐ నాగార్జునరాజు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలించగా మృతదేహాలు లభ్యమయ్యాయి.
మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. ఇలావుండగా లండన్‌లో చదువు ముగించుకుని వచ్చిన సుధీర్ తన స్నేహితుడైన కార్తీక్‌తో కలిసి హైదరాబాద్‌లో షార్ట్ఫిల్మ్స్ తీస్తున్నాడు. ఈనేపధ్యంలో వారం రోజుల క్రితం వీరిరువురూ కెమెరామన్ విజయ్‌తో కలిసి రాజమండ్రి వచ్చారు. సుధీర్ వివాహితుడు. శనివారం తన భార్య పుట్టిన రోజు శుభాకాంక్షలను ఫోన్‌లో తెలిపి పిచ్చుకలంక లొకేషన్ చూడటానికి వచ్చినట్టు సమాచారం.