క్రైమ్/లీగల్

మున్సిపల్ ఎన్నికలకు గడువు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 18: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఇప్పటికపుడు నిర్వహించలేమని, గడువు కావాలని ప్రభుత్వం మంగళవారం నాడు హైకోర్టులో కౌంటర్ దాఖలుచేసింది. మున్సిపాల్టీల కాలపరిమితి ముగుస్తున్నందున ఎన్నికలు నిర్వహించమని ఆదేశించాల్సిందిగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన పిటీషన్‌పై ప్రభుత్వం తన కౌంటర్‌ను దాఖలుచేయాలని గత పక్షం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి నవీన్‌కుమార్ ఆదేశించారు. పిటీషనర్ తరఫున కేజీ కృష్ణమూర్తి, ధర్మేశ్ జైస్వాల్‌లు, ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ కే రామచంద్రరావులు తమ వాదనలు వినిపించారు. వచ్చే నెల రెండో తేదీ నాటికి మున్సిపాల్టీల గడువు ముగుస్తుందని రాజ్యాంగంలోని 243(3) అధికరణం ప్రకారం ఐదేళ్లకో మారు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని పిటీషనర్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు ఖరారు లాంటి చర్యలను చేపట్టలేదని పిటీషనర్ వాదించారు. ఇదే తరహా వ్యాజ్యం రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిందని, అది కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణలో ఉందని ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది విద్యాసాగర్ న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. దీంతో ఈ రెండింటితో పాటు మొత్తం మూడు పిటీషన్లను కలిపి నివేదించాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణ బుధవారం కొనసాగనుంది.