క్రైమ్/లీగల్

తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 20: వరంగల్‌లో చిన్నారిపై అత్యాచారం, హత్య సంఘటన మరువక ముందే హైదరాబాద్‌లో మరో పైశాచిక ఘటన చోటు చేసుకుంది. తొమ్మిదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారం జరిపాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతన్ని పట్టుకుని కట్టేసి దేహశుద్ధి చేస్తుండగా తప్పించుకుని పారిపోయాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రామంతాపూర్ టీవీ కాలనీలో ఖమ్మం జిల్లా జములాపూర్‌కు చెందిన కుటుంబం బతుకుదెరువు కోసం నాలుగు నెలల క్రితం వచ్చింది. ఇద్దరు పిల్లలతో భార్యాభర్తలు కలిసి వచ్చిన వీరు ఇదే ప్రాంతంలో నివసిస్తున్న బిల్డర్ లింగం వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం భర్త నిర్మాణంలో ఉన్న భవనంలో పని చేస్తుండగా భార్య ఇంటికి నీళ్లు కొడుతోంది. గుడిసె ముందు ఇసుక కుప్పలపై ఆడుకుంటున్న నాలుగో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలికను పక్కనే పని చేస్తున్న లక్ష్మణ్(23) నిర్మాణంలో ఉన్న భవనంపైకి తీసికెళ్లాడు. ఆమెపై అత్యాచారం చేసి పారిపోయాడు. ఏడ్చుకుంటూ కిందికి వచ్చిన చిన్నారిని తల్లి గమనించి అడిగితే జరిగిన ఘోరాన్ని వివరించింది. ఈ విషయం వెంటనే స్థానికులకు చెప్పడంతో పారిపోతున్న లక్ష్మణ్‌ను పట్టుకుని చితకబాదుతుండగా ఇందులో బిల్డరే అతన్ని తప్పించినట్లు ఆరోపించారు. నిందితుడు ఆంధ్రాకు చెందిన వాడని, మూడు నెలలుగా ఇక్కడే పని చేస్తున్నాడని చెప్పారు. అందిన సమాచారం ప్రకారం ఏసీపీ గోనె సందీప్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ రవి కుమార్, ఎస్‌ఐ జయరాం సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లారు. చిన్నారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ పేర్కొన్నారు.
చిత్రం...చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు లక్ష్మణ్