క్రైమ్/లీగల్

ఘోర రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలుకూరు, జూన్ 21: సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని సీతారామపురం సమీపంలో గోదాముల వద్ద శుక్రవారం జరిగిన ఘెరో రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చిత్తపల్లి గ్రామానికి చెందిన అబ్జల్ పాషా కుటుంబసభ్యులు కోదాడలో జరిగిన శుభకార్యానికి హాజరై గురువారం జాన్‌పహాడ్ వెళ్లి శుక్రవారం ఉదయం హుజూర్‌నగర్ నుండి ఆటోలో వస్తుండగా ముందువెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేస్తుండగా కోదాడ నుండి వస్తున్న లారీ ఆటోను బలంగా ఢీకొట్టి ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల మీదుగా దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి
తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన వారిని హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి, చనిపోయిన వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారిలో ఎండీ అబ్జల్‌పాషా (50), అతడి భార్య ఎండీ గౌసియా (48), తమ్ముడి భార్య ఎండీ మహిముదాబేగం (35), తమ్ముడి పెద్ద కుమార్తె ఎండీ మహిన్ (13), మృతిచెందారు. చిన్న కూతురు ముస్కన్ (10)ను చికిత్స నిమిత్తం ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. అబ్జల్‌పాషా తమ్ముడు మహబూబ్‌పాషా (41) తలకు బలమైన గాయాలు కావడంతో ఖమ్మం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. అబ్జల్‌పాషా కుమారుడైన జాకీర్‌పాషాకు, ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో బంధువులు రోదనలతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి దద్దరిల్లిపోయింది. ప్రమాదస్థలిని జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు సందర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు.