క్రైమ్/లీగల్
లారీ కింద పడి వ్యక్తి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 23 June 2019
జీడిమెట్ల, జూన్ 22: ప్రమాదవశాత్తు లారీ క్రింద పడ్డ వ్యక్తి మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఆంధప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా, వెంపల్లి మండలం, వెములవారి పల్లి గ్రామానికి చెందిన ఎటూరీ శ్రీనాధ్ రెడ్డి(31) సంవత్సరంన్నర క్రితం బాచుపల్లిలోని ఐజేఎం కాంక్రీట్ ప్రాడక్ట్ లిమిటెడ్ పరిశ్రమలో క్వాలిటీ టెక్నీషియన్గా విధులను నిర్వహిస్తున్నాడు. 21తేదీ రాత్రి 11గంటల సమయంలో రెడీమిక్స్ కాంక్రీట్ వాహనంలో క్వాలీటీని చెక్ చేస్తూ వుండగా వాహన డ్రైవర్ లారీని నడపడంతో లారీ కింద పడటంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.