క్రైమ్/లీగల్

మానసిక స్థితి సరిగా లేని కుమారులకు నిద్రమాత్రలు ఇచ్చి, తాను మింగిన తల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జూన్ 22: గత 15 సంవత్సరాలుగా మానసిక, అంగవైకల్యంతో బాధపడుతున్న కుమారులను చూసి, తీవ్ర మనస్థాపం చెందిన తల్లి ఇద్దరు కుమారులకు నిద్ర మాత్రలు వేసి, తాను నిద్ర మాత్రలు మింగిన సంఘటన రాంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రాంపల్లి గ్రామం, లక్ష్మీనగర్‌లో నివాసముంటున్న నర్సింహా రెడ్డి, పద్మ దంపతులకు మతిస్థిమితం, అంగవైకల్యంతో బాధపడుతున్న తేజవర్ధన్, మనువర్ధన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 15 సంవత్సరాలుగా కదలలేని స్థితిలో మానసిక వైకల్యం కల్గిన కుమారులను చూసి తల్లి పద్మ చలించి పోయింది. శనివారం భర్త నర్సింహారెడ్డి విధులకు వెళ్లిన తరువాత కుమారులకు నిద్ర మాత్రలు వేసి, పద్మ నిద్రమాత్రలు మింగింది. గమనించిన పక్కింటి వారు వెంటనే భర్త నర్సింహారెడ్డికి ఫోన్ చేశి వెంటనే వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుమారుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తలిపారు. ఈ మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.