క్రైమ్/లీగల్
సచివాలయం కూల్చివేతపై హైకోర్టుకు రేవంత్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 28 June 2019
హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేసి కొత్త సచివాలయం నిర్మించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై మల్కాజ్గిరి ఎంపీ , కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కట్టడం కూల్చివేతను అడ్డుకోవాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తోందని ఆయన పిటీషన్లో పేర్కొన్నారు. రేవంత్ పిటీషన్పై శుక్రవారం నాడు విచారణ జరిగే అవకాశం ఉంది. సచివాలయం నూతన భవనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నాడు డీ బ్లాక్ వెనుక ఉన్న తోటలో శంకుస్థాపన చేశారు. 400 కోట్ల రూపాయిలతో కొత్త సచివాలయం నిర్మించాలని ప్రభు త్వం నిర్ణయించిందని ప్రజా ధనాన్ని దుబారా చేయడమేనని అన్నారు.