క్రైమ్/లీగల్

ఆటో డ్రైవర్ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 27: ఆటో డ్రైవర్ హత్య కేసులో ఇద్దరు నిందితులను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం ఉప్పల్, చిలుకానగర్, న్యూ రామ్‌నగర్‌లో నివాసముండే సింగిశెట్టి ఉదయ్ శంకర్ (23), గంజి శ్రీకాంత్ (33) బంధువులు. సికింద్రాబాద్, తుకారామ్‌గేట్ సాయినగర్‌లో నివాసముండే ఆటోడ్రైవర్ మెరుగు సాయి ప్రసాద్ (23) వీరికి బంధువు. ఈనెల 24న సాయిప్రసాద్‌ను శంకర్, శ్రీకాంత్ ఫంక్షన్‌కు పిలిచారు. ముగ్గురు కలిసి స్థానిక గోల్డెన్‌బార్‌లో మద్యం సేవించారు. బార్ బిల్లు చెల్లించే విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. సాయి ప్రసాద్ తిట్టిన మాటలతో ఆగ్రహించిన ఉదయ్ శంకర్, శ్రీకాంత్ చేతిలో ఉన్న బీర్ సీసాతో తలపై కొట్టాడు. కింద పడిపోయిన సాయి ప్రసాద్‌ను ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించి ఇంటికి తీసుకువచ్చారు. సాయిప్రసాద్ అదే రోజు సాయంత్రం మృతిచెందాడు. ఆరోజు నుంచి పరారీలో ఉన్న ఉదయ్ శంకర్, శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రవిబాబు తెలిపారు.