క్రైమ్/లీగల్

చిత్తూరు జిల్లాలో పరువు హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలమనేరు, జూన్ 28: చిత్తూరు జిల్లా పలమనేరు మండంలో పరువు హత్య సంచలనం రేకేత్తించింది. కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న అగ్రహించిన కన్నతండ్రే ఆమె పాలిట యముడైయ్యాడు. కన్న ప్రేమను కాదని అతి దారుణంగా గొంతు నులిపి చంపి అనంతరం పాడు పడిన బావిలో పడేసిన దారుణం పలమనేరు మండలం ఉసర పెంట గ్రామంలో శుక్రవారం చోటు చేసుకొంది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహంతో ఊగిపోయి నిందితుని ఇంటిపై దాడి చేసి పాక్షికంగా ధ్వంసం చేసి ద్విచక్రవాహన్నా కాల్చి వేశారు. పోలీసులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పలమనేరు మండలం ఉసర పెంటగ్రామానికి చెందిన భాస్కర్ నాయుడు కుమార్తె హేమావతి (23) అదే గ్రామానికి చెందిన ఎస్పీ కులానికి చెందిన గోవిందు కుమారుడు కేశవులు (25)ను ప్రేమించి రెండు సంవత్సరాల క్రితం పెళ్లిచేసుకుంది. వీరి వివాహానికి హేమావతి కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పారు. దీంతో భయపడిన ఆ జంట గ్రామం విడిచి పారిపోయారు. హేమావతి తల్లిదండ్రులకు భయపడి కేశవులు పలు చోట్ల తలదాచుకొని కూలి పని చేసుకొంటూ బతుకు బండి లాగిస్తున్నాడు. ఈనేపధ్యంలో హేమావతి గర్భం దాల్చడంతో వారం రోజుల క్రితం పలమనేరు అసుపత్రికి తీసుకొచ్చాడు. అక్కడే ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది, ఈసందర్భంగా శుక్రవారం కేశవులు తన భార్య పురిటి బిడ్డను తీసుకొని తన స్వగ్రామమైన ఉసర పెంటకు ఆటోలు బయలు దేరారు. దీన్ని పసి కట్టిన హేమావతి తల్లి దండ్రులు బంధువులు కాపుకాచి ఉసర పెంట శివారులో వీరు వస్తున్న ఆటోను అడ్డగించి కేశవులపై దాడి చేశారు. అనంతరం హేమావతిని బలవంతంగా కిందికి దించి మామిడి పోలంలోకి తీసుకెళ్లి గొంతు నులిపి చంపి మృతదేహాన్ని అక్కడే ఉన్న పాడుపడిన బావిలో పూడ్చి వేశారు. ఈ సమాచారం తెలుసుకొన్న గ్రామస్తులు భాస్కర్ నాయుడు ఇంటిని ధ్వంసం చేశారు. వారి బంధువుల ఇండ్లపై దాడి చేసి ఒక ద్విచక్రవాహనాన్ని కాల్చి వేశారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే సంఘటనాస్థలానికి పలమనేరు డీ ఎస్పీ యుగంధర్ బాబు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రస్తుతం గ్రామంలో ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందో బస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు భాస్కర్ నాయుడుతో పాటు అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొన్నారు.