క్రైమ్/లీగల్

క్రికెట్ బెట్టింగ్ బుకీల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: హైదరాబాద్ నగరంలోని చార్మినార్, మొగల్‌పురలో క్రికెట్ బెట్టింగ్ కేంద్రాలపై నార్త్‌జోన్ టాస్క్ఫోర్స్ బృందాలు దాడులు నిర్వహించాయి. స్థానిక పోలీసులతో కలిసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 69వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అమాయకుల నుంచి అక్రమ మార్గాల ద్వారా డబ్బులు సంపాదించాలన్న లక్ష్యంతో చార్మినార్ పోలీస్టేషన్ పరిధిలోని గుల్జర్ హౌస్ ప్రాంతంలో హర్యానాకు చెందిన అశీష్ మిశ్రా (34), సందీప్ మిశ్రా (44) క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇద్దరినీ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా మొగల్‌పురా పోలీస్టేషన్ పరిధిలోని లాల్‌దర్వాజాలోని వైఫై బార్ అండ్ రెస్టారెంట్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న రాజన్నభావి లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్న క్రికెట్ బుకీ పున్నా జితేందర్ (33)ను అరెస్టు చేశారు. రూ.16 వేల నగదుతో పాటు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.